ఉప్పర్లపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

ఉప్పర్లపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల ఉప్పర్లపల్లె గ్రామం నందు బుధవారం రోజున వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పా వేణు,మాజీ సర్పంచ్ శ్రీనివాసులు,విద్యా కమిటీ చైర్మన్ కంబగిరి,గ్రామ రైతులు మరియు మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమం పై రైతులకు అవగాహన చేసి ఈ పథకంలో భాగంగా 30 మంది రైతులను ఎంపికచేశారు. అదేవిధంగా రైతులకు కౌలు కార్డు గురించి తెలిపి మరియు కౌలు కార్డు యొక్క ప్రాముఖ్యతను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లక్ష్మీ నారాయణ,ఎంపీఈఓ నాగరాజు,శిరీష, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!