విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి

విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి

కర్నూలు, న్యూస్ వెలుగు; 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల శకటాల్లో విద్యాశాఖకు చెందిన శకటానికి మొదటి స్థానం లభించింది. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఈ శకటం జిల్లా స్థాయిలో హాజరైన అధికారులందరినీ ఆకర్షించింది. విద్యా శాఖలో చేస్తున్నటువంటి నూతన ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ ఏర్పాటుచేసిన శకటం లో డిజిటల్ ల్యాబ్, వి. లెర్న్ తదితర ప్రత్యేక అంశాలతో ప్రదర్శితం అవుతుండగా అందులో విద్యార్థులు ముందుగా నిల్చుని, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ స్లోగన్లతో నడుస్తూ పూలతో వెళ్లడం లాంటి వైవిధ్యభరితంగా సిద్ధం చేయడంతో ఈ శకటం అందరూ విద్యాశాఖ కృషిని ప్రత్యేకంగా ప్రశంసలందుకున్నది. అలాగే ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొని విభిన్న రీతిలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. స్వాతంత్ర ఉద్యమ చరిత్రను, స్వాతంత్ర ఉద్యమ ప్రస్థానాన్ని వివరిస్తూ నాటకీయంగా విద్యార్థులు ప్రదర్శించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఉత్సవాల కంటే ఈ ఏడాది భారీగా విద్యార్థులు పాల్గొనడం, అలాగే శుద్ధిగా తమ ప్రదర్శనను చేసి అందరి మన్ననలు పొందడంతో విద్యాధికారులు చేస్తున్న కృషిని పొగడకుండా ఉండలేకపోయారు. ఆద్యంతము విద్యార్థుల ప్రదర్శిస్తున్న ప్రదర్శనలు తిలకిస్తున్న అధికారులు, హాజరైన ప్రముఖులు కరతాళ ధ్వనులతో ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష విద్యాశాఖ అధికారుల సమిష్టి కృషి, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సమైక్యతాతత్వమే విజయానికి కారణమంటూ జిల్లా విద్యాధికారి కితాబు ఇవ్వడం విద్యాశాఖ హుందాతనాన్ని పెంచింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మార్గదర్శకత్వంలో చేస్తున్న ఈ ప్రయత్నాలు సత్ఫలితాలు దిశగా ప్రయాణిస్తున్న సందర్భంలో విద్యాశాఖకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అపార్ నమోదులో కనీ విని ఎరుగనిరీతిలో నాలుగు లక్షల 41 వేల మంది పైచిలుకు విద్యార్థులను నమోదు చేయించిన కర్నూలు విద్యాశాఖ అధికారులు, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ లో జాతీయస్థాయిలో రెండవ స్థానాన్ని ఆక్రమించి కర్నూలు విద్యాశాఖ విజయపతాకాన్ని ఎగురవేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్లోనూ తొలి 5 స్థానాల్లో ఏ గ్రేడ్ ను సాధించి కర్నూలు విద్యాశాఖ చరిత్ర సృష్టించింది. ఇంతటి ఘనవిజయాలను పొందుతున్న విద్యాశాఖ అందరి సమన్వయంతో సమిష్టి తత్వంతో సమైక్యత భావంతో నిశ్శబ్ద విజయాలను సాధించడం పట్ల ఇతర శాఖల అధికారులు ప్రజలు అచ్చెరువు నొందుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి ఎస్ శ్యామ్యూల్ పాల్ మాట్లాడుతూ పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కృంగి పోకుండా రాబోయే 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కోరుకుంటున్నాను అని ఇది సమిష్టి విజయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలోనే ఉత్తమ అధికారిగా జిల్లా విద్యాధికారి ప్రశంస పత్రం అందుకోవడం గమనార్హం.

Author

Was this helpful?

Thanks for your feedback!