రాష్ట్రంలో జాంబవంతుని మొదటి విగ్రహ ప్రతిష్ట

రాష్ట్రంలో జాంబవంతుని మొదటి విగ్రహ ప్రతిష్ట

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గంలోని ధర్మాపురం గ్రామం వద్ద ఉన్న శివుని ఆలయం ప్రాంగణంలో మూడు అడుగుల జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూక రాజు అని కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉందని క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు అని వాల్మీకి రామాయణంలో జాంబవంతుని గురించి రచించారని విగ్రహ దాత కె.పి హరి రాయల్ తెలిపారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో మొదటి జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. కేపీ హరీంద్ర సొంత నిధులతో సుమారు రెండు లక్షల రూపాయలతో జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట ఇక్కడ జరిగిందని గత మూడు రోజులుగా హోమాలు, అభిషేకాలు జరిగాయని అర్చకులు భరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈరోజు శుక్రవారం కలిశస్థాపన మహా పూర్ణాహుతి జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగిందని అలాగే అన్న ప్రసాదాలు నిర్వహించామని అర్చకులు భరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి శివాలయం ధర్మకర్తలు, ధర్మాపురం గ్రామ ప్రజలు, జమ్మలమడుగు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!