పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలి ఇవ్వాలి

పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలి ఇవ్వాలి

   సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప 

కర్నూలు, న్యూస్ వెలుగు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నా చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ లోని అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర నగర కార్యవర్గ సభ్యులు ఎంబీసన్న అధ్యక్షతన ధర్నా జరిగినది ఈ ధర్నాకి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప హాజరై వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలో పేదలు గుడిసెలు వేసుకొని దాదాపుగా రెండు సంవత్సరాల నుండి కాపురం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు వారందరికీ పట్టాలు ఇవ్వాలని నివసించే ప్రాంతంలో రోడ్లు మురికి కాలువలు కరెంటు మంచినీటి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న పేదల సమస్యల పరిష్కారం కోసం ఏ రోజు మాట్లాడిన పాపాను లేదని రాష్ట్రంలోని పేదలకు సూపర్ సిక్స్ పేరుతో పథకాల పేర్లు చెప్పి మహిళలకు ఫ్రీ బస్సు 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తల్లికి వందనం ఇలా అనేక పథకాలు ప్రజలకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైయస్సార్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలను మోసం చేసిందని మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతంలోని పేదలకు రెండు సెంట్లు స్థలం ఇస్తానని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా హామీల వైపు కనీసం రాష్ట్ర ప్రభుత్వం చర్చించినట్టు కూడా ఎక్కడ కనిపించడం లేదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు పేదలకు సొంతింటి కల నెరవేరే దాకా పేదల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలంటే బళ్లారి చౌరస్తా కొత్త బస్టాండు రాజ్ విహార్ సెంటర్ ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని కర్నూలు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును తక్షణమే నిర్మాణం చేపట్టాలని హంద్రీ ప్రహరీ ఫెడ్వాల్ నిర్మాణం చేపట్టాలని అండర్ డ్రైనేజీ మురికి కాలువలు నిర్మాణం చేపట్టాలని ఈ సమస్యల కోసం మంత్రి ఎమ్మెల్యేలు కృషి చేయాలని నగరంలో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేసి నగరంలో ని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆ వైపును పాలకులు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమం జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ సిపిఐ నగర సహాయ కార్యదర్శులు జి చంద్రశేఖర్ డి శ్రీనివాసరావు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసులు నగర అధ్యక్షులు నాగరాజు  నగర కార్యవర్గ సభ్యులు నల్లన్న
ఏ ఐ టి యు సి నగర డిప్యూటీ కార్యదర్శి అంజి మహిళా సమాఖ్య నగర నాయకులు
నాగేషమ్మ సులోచనమ్మ వెంకటేశ్వరమ్మ ధనలక్ష్మి మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ నాయక్ వినతిపత్రం అందజేయడం జరిగినది.

Author

Was this helpful?

Thanks for your feedback!