
జనసేనాధినేత ఆశయాలే ఊపిరి గా ప్రజల దాహార్తిని తీరుస్తున్న జనసేన చలివేంద్రాలు”
జెఎస్పి తాలుకా నాయకులు బి సి నాగరాజు
ఎమ్మిగనూరు, న్యూస్ వెలుగు; ఎమ్మిగనూరు పట్టణంలో తాలుకా జనసేన పార్టీ నాయకులు బి సి నాగరాజు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణం లో మా ఆరాధ్య దైవం జనసేనాధినేత, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనే ద్యేయంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐదు ప్రధాన కూడళ్లలో “చలివేంద్రాలు” ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజా సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా, ప్రజాహితమే మా బాట గా కొనసాగుతూ, జనసేవ లో జనసేన అనే నినాదంతో ఈ చలివేంద్రాలు మండుతున్న ఎండలో ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని తెలిపారు, ఈ చలివేంద్రాలు సజావుగా కొనసాగేలా ఇటు ప్రభుత్వం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అటు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!