
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య దారుణం
హోళగుంద, న్యూస్ వెలుగు: ఆలూరు తాలూకా అరికెర గ్రామం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్యను ఎస్డిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఇందులో భాగంగా ఆదివారం ఎస్డిపిఐ నాయకులు ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు హమీద్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సుబాన్ బాధిత కుటుంబీకులను పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురువ బండారి ఈరన్న పై జరిగిన దారుణ హత్యను ఎస్డిపిఐ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయని,ఏ పార్టీ వాళ్లు అధికారంలో ఉంటే ఆ పార్టీ కి సపోర్ట్ చేసే ఉద్యోగులను నియమించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.రూ.12000 జీతంతో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగానికి ఇంతగా పోటాపోటీ నా…లేక వేరే ఉద్దేశంతో హత్యకు పాల్పడ్డార అని ప్రశ్నించారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ,పత్తికొండ డిఎస్పి వెంకట రామయ్య ఈ దారుణ హత్య పై వెంటనే విచారణ జరిపి ఎవరైతే ఈ దారుణ హత్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూడాలని డిమాండ్ చేశారు.మరియు మృతుడి కుటుంబ పరిస్థితి పిల్లల భవిష్యత్తునీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే హత్య కాబడిన ఫీల్డ్ అసిస్టెంట్ బండారి కురువ ఈరన్న కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి రూ.50 లక్షల నష్టపరిహారం వెంటనే అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,మృతుడి తల్లీ, భార్య,పిల్లలు,గ్రామస్తులు,ఎస్డిపిఐ నాయకులు భాష,షఫీ,మైఫుజ్,అరిఫ్,అబ్రార్,భక్షి,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.