హంద్రీనీవా జలాల ద్వారా చెరువులను నింపాలి

హంద్రీనీవా జలాల ద్వారా చెరువులను నింపాలి

  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

* జొన్నగిరి చెరువును పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

* హంద్రీనీవా జలాలతో రైతులను, ప్రజలను ఆదుకోవాలి.

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: హంద్రీనీవా జలాల ద్వారా పూర్తిస్థాయిలో చెరువులను నింపి తుగ్గలి మండలాన్ని సస్యశ్యామలం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం రోజున పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గల తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామం చెరువును ఆయన పరిశీలించారు.ఈ జొన్నగిరి చెరువు పరిశీలనలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పైపులైన్ ద్వారా హంద్రీనీవా జలాలను పూర్తిస్థాయిలో చెరువులకు మళ్లించి పత్తికొండ నియోజకవర్గంలో త్రాగు మరియు సాగు నీరు సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టు సంబంధించిన కాలువలను వెడల్పు చేయాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామం వద్ద త్రాగునీటి సమస్య పరిష్కారం కొరకు ఒక రిజర్వాయర్ ను ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.హంద్రీనీవా జలాలను చెరువులకు మళ్ళించడం ద్వారా మండలంలో ఎటువంటి నీటి సమస్య లేకుండా మండలం సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి నిలిచిపోయిన పైపులైను పనులను ప్రారంభించి చెరువులను త్వరితగతిన నీటితో నింపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్,సిపిఐ తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్,తుగ్గలి ఎంపీపీ ఎర్ర నాగప్ప,మాజీ విద్యా కమిటీ చైర్మన్ గుంత రఘు,మండల సిపిఐ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!