
ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి చిన్నహ్యట శేషగిరికి కేటాయించాలి
టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య
హొళగుంద, న్యూస్ వెలుగు: ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ రిజర్వుడు కావడంతో హొళగుంద మండల కేంద్రానికి చెందిన చిన్నహ్యట శేషగిరికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కేటాయించాలని మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో 1999 నుంచి క్రియాశీల సభ్యుడిగా చేరి పార్టీకి విశేష సేవలను అందిస్తూ…అంచలంచలుగా దిగువ స్థాయి నుంచి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారన్నారు.దానికి తోడుగా గత 26 సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల విజయానికై విశిష్ట ప్రణాళికలను రచించి పార్టీ అభ్యర్థుల విజయానికి తనదైన శైలిలో పాటుపడ్డారన్నారు.తెలుగుదేశం పార్టీలో నిష్కల్మషుడు వివాదరహితుడిగా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సుపరిచితుడైన విద్యావంతుడు,అనుభవజ్ఞుడు,రాజకీయ కోవిదుడైన చిన్నహ్యట శేషగిరి శాసనసభ ఎన్నికల్లో బనగానపల్లె మంత్రాలయం నియోజకవర్గపు ఎన్నికల సమన్వయకర్తగా కూడా తన సేవలనందించారన్నారు.అంతేకాకుండా గతంలో ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు రాష్ట్ర దళిత నాయకులుగా ప్రఖ్యాతిగాంచి, దళిత బడుగు బలహీన వర్గాలతో పాటు సకల సమూహాలను సమిష్టిగా సమైక్యతతో ఏకం చేస్తూ,సర్వులకు సానుకూలమైన వ్యక్తిగా కార్య సాధకుడిగా ప్రజా పాలనలో తనదైన ముద్ర వేశారన్నారు.కాగా గతంలో ఆలూరు అసెంబ్లీ స్థానానికి ఎస్సీ రిజర్వుడు స్థానం కేటాయించగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మసాలా ఈరన్న విజయ దుందుభి మోగించి శాసనసభ సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ రాకపోగా ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఎస్సీ సమూహాన్ని గుర్తిస్తూ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానాన్ని ఎస్సిలకు రిజర్వ్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.అయితే ఇప్పటివరకు ఆలూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల వారు మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా నియమించబడ్డారు.కానీ హొళగుంద మండలానికి ఆలూరు మార్కెట్ యార్డులో సముచిత స్థానం లభించకపోయినందున ఈ సారి తప్పకుండా హొళగుంద మండలాన్ని గుర్తిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా మంచిపట్టున్న అపార అనుభవజ్ఞ దళిత నాయకులు మరియు టిడిపి సీనియర్ నాయకులైన చిన్నహ్యట శేషగిరికి తప్పకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయిస్తేనే పార్టీ కోసం పాటుపడిన వారి సేవలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు.అంతేకాకుండా హొళగుంద మండలానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని మరియు ఆలూరు నియోజకవర్గ నాయకులను కోరారు.ఈ సమావేశంలో కుడ్లూరు ఈరప్ప,టిడిపి సీనియర్ నాయకులు తోక వెంకటేష్,టిడిపి యువ నాయకులు గిరి,ఖాదర్ భాష,దిడ్డి సిద్ధప్ప,వలి భాష,ఐటిడిపి నాయకులు హనుమంతు,టిఎన్ఎస్ఎఫ్ మల్లీ,జమ్మయ్య,బంగారప్ప,గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.