
గవర్నర్ల కృషిని ప్రశంసించిన రాష్ట్రపతి
Delhi (ఢిల్లీ) :రాష్ట్రపతి భవన్లో రెండు రోజుల గవర్నర్ల సదస్సు ముగిసింది. సమగ్ర చర్చలు జరపడానికి గవర్నర్ల సమిష్టి కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. తన ముగింపు ప్రసంగంలో, వివిధ గవర్నర్ల బృందాలు తమ కార్యాలయ పనితీరును మెరుగుపరచడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం తమ విలువైన ఆలోచనలు ముందుకు వచ్చారని ఆమె ప్రశంసించారు. ఈ సూచనలను అమలు చేస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను కలుపుకొని వేగవంతమైన అభివృద్ధిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని, అన్ని రాష్ట్రాలు పరస్పరం సహకారం , అనుభవాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!