పొలం పిలుస్తోంది కార్యక్రమం

పొలం పిలుస్తోంది కార్యక్రమం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని చిన్నాహ్యట,మార్లమడికి గ్రామాల్లో మంగళవారం మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరి పంటల్లో గ్రామ విత్తన పథకం పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.రబీ పంటలైన జొన్న,వరి,వేరుశెనగ,శెనగ పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన,వాతావరణ భీమా చేసుకోవాలన్నారు.ఎకరానికి జొన్నకు రూ.297/- రూపాయలు,వేరుశనగ రూ.480/-రూపాయలు,వరికి రూ.630/- రూపాయలు,శెనగ పంటకు రూ.420/- రూపాయలు భీమా చెల్లించాలన్నారు.మరియు రబీ భీమాను డిసెంబర్ నెల 15వ తేది లోపు చేసుకోవాలని సూచించారు.మరియు రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే ప్రీమియం చెల్లిస్తాయని,ఇతరులు సిఎస్సి కేంద్రాలకు వెళ్లి భీమా చేయించుకోవాలని తెలియజేశారు.పంట భీమా చేసుకునేందుకు రైతులు తమ పొలం పాస్ బుక్,బ్యాంక్ పాస్ బుక్,ఆధార్ కార్డు తీసుకోని భీమా చేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ వీరుపాక్షి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!