ఎన్నికలలో ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలి ; సిపిఐ, బికేఎంయు

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలి ; సిపిఐ, బికేఎంయు

తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించి,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందజేయాలని సిపిఐ,బికేఎంయు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి లోని గల స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు అందజేసిన అర్జీదారుల సమక్షంలో సిపిఐ,బికేఎంయు నాయకులు ఇంటి స్థలం సమస్యలను పరిష్కరించాలని వారు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పట్టణం నందు రెండు సెంట్లు మరియు గ్రామాల యందు మూడు సెంట్లు ఇంటి స్థలాలను పంపిణీ చేసి, ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ రమాదేవి కు వినతిపత్రాన్ని అందజేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు తెలియజేశారు.అర్జీదారులు అందజేసిన అర్జీల ద్వారా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు తహసిల్దార్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్,సిపిఐ,బికేఎంయు నాయకులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!