
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన కెవి సుబ్బారెడ్డి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూన్న కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్, రాయలసీమ యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ, మాట్లాడుతూ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజులో కూడా కళాశాల నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలోని విద్యార్థులను ఇంటికి పంపించాలని చెప్పిన యాజమాన్యం వాగ్వాదం చేస్తూ మేము అధికార పార్టీ వాళ్ళం అంటూ మేము కళాశాల ఇలానే నిర్వహిస్తాము ఎవరికి కంప్లైంట్ చేస్తారో చేసుకోండి అంటూ దురుసుగా మాట్లాడుతూ మీది మీదికి వచ్చారని అన్నారు.అటానమస్ ఉందని విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ సరైన మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గుర్తిస్తున్నారు. జేఎన్టీయూ అధికారులకు లంచాలు ఇవ్వటం వల్ల ఎన్ని సార్లు కంప్లైంట్స్ చేసిన కళాశాల వైపు తొంగిచూడటం లేదన్నారు. గతంలో న్యాక్ బృందం కళాశాలను తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఏ ప్లస్ ర్యాంక్ ఇవ్వడం వెనక కూడా అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. కాబట్టి తక్షణమే ఈ కళాశాల పైన సిబిఐ అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమపిల్లలను ఇలాంటి నాసిరకం కలశాలలో చేర్పించకూడ జాగ్రత పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ జిల్లా కో కన్వీనర్ మనోహర్ జిల్లా నాయకులు శంకర్ జితేంద్ర రజాక్ తదితరులు పాల్గొన్నారు