
సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిన టిడిపి ప్రభుత్వం
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఎక్కడ… ?
విపరీతంగా పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు.
ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైసిపి నాయకులు.
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:
గత సార్వత్రిక శాసనసభ,పార్లమెంటు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలైన సూపర్ సిక్స్ హామీలను తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారని మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి,జడ్పిటిసి పులికొండ నాయక్,మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్,వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్,మండల కన్వీనర్ అట్లా గోపాల్ రెడ్డి,నియోజకవర్గ వైసిపి ఐటి సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నియోజకవర్గ వైసిపి ఎస్టి సెల్ అధ్యక్షులు భీమా నాయక్,వైసిపి సోషల్ మీడియా ప్రతినిధి బొందిమడుగుల ఈశ్వర్ రెడ్డి లు అన్నారు.మంగళవారం తుగ్గలిలోని మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి నివాస గృహంలో మండల వైసిపి ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ త్వరలో వైసిపి మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.ఇప్పటికే పలువురు నాయకులకు పార్టీలో వివిధ పదవుల ను అధిష్టానం ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో మరి కొంతమంది నాయకులకు, పార్టీ కార్యకర్తలకు పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు.వైసిపి పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వైసీపీ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ప్రస్తుతం గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని త్వరలో వైసిపి నాయకులు,కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధం అవుతామని తెలిపారు.నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పింఛన్లు మాత్రమే అందిస్తున్నారని, అందులోనూ కోతలకు సిద్ధమవుతున్నారని అన్నారు.ఆర్థిక సమస్యలు అంటూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినప్పుడే అప్పటి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని తాను ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా చంద్రబాబు సంక్షేమ పథకాలను ఇవ్వలేరని చెప్పారని తెలిపారు.కానీ 14 ఏళ్లు సీఎంగా,ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆర్థికమంత్రిగా పని చేసిన చంద్రబాబు తో పాటు బీజేపీ నేతలు,పవన్ కళ్యాణ్ లు మేమున్నాం సూపర్ సిక్స్ అమలు చేస్తాం అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారని తెలిపారు.ఆనాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని చెబుతూనే సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామంటూ చంద్రబాబు అన్నారన్నారు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తీరా ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంలేదని అన్నారు.అందువల్ల ఈ పథకాల అమలు చేసే విధంగా తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప్పర్లపల్లి వైస్ సర్పంచ్ రామాంజనేయులు, వైఎస్ఆర్సిపి నాయకులు రత్న నాయక్,రాతన సురేష్,కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.