
దేశంలో ఏ పార్టీకీ లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే సొంతం
హొళగుంద, న్యూస్ వెలుగు; సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం గత వారం రోజులు నుంచి మొదటి స్థానం లో నిలబెట్టమని ఇది కార్యకర్తల బాధ్యత, కష్టం,వలెనే సాధ్యమైంది త్వరలో టాప్ ప్లేస్ లోకి తెస్తామని వైకుంఠం శివ ప్రసాద్ తెలిపారు. గురువారం హొళగుంద లో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ & టీడీపీ మహిళ నాయకురాలు వైకుంఠం జ్యోతి గ్రామ ఘనస్వాగతంపలికిఆహ్వానించారు.టిడిపి కార్యకర్తలు కు &ప్రజలకు టిడిపి అబిమానులు కు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే5, లక్షలు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని .అలాగే సహజ మరణం అయితే 200000, రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.కార్యకర్త మరణిస్తే మట్టి ఖర్చు 10000, రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అనిప్రజలందరూ ఈ సభ్యత్వం కార్యక్రమం లో తమ తమ పేర్లు నమోదు చేసుకోవాలి అని తెలియజేసారు. ఈ సందర్బంగా వైకుంఠం శివ ప్రసాద్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం కల్పించడంతో పాటు, ప్రభుత్వంలో పదవులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.దేశంలో ఏ పార్టీకీ లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే సొంతం.కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నందునే పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.కార్యకర్తలారా! సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని మరిన్ని రికార్డులను సృష్టించి పసుపుదళానికి తిరుగేలేదని అన్నారు,ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య చిన్ని ఆట శేషిగిరి, గోవింద్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి దర్గాన్న, చోళరెడ్డి, కాకిసీతయ్య తోక వెంకటేష్ ఖాదర్ ఏరి స్వామి వీరప్ప బీరప్ప బీరప్ప మల్లికార్జున దిడ్డి నాగప్ప అనుమప్ప బసప్పఅయ్యప్ప రెడ్డి శశి శేషరెడ్డిగిరి వెంకటేష్ బుద్దప్ప షమీ టీడీపీ నాయకులు, TNSF నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.