
ద్రోణి కొనసాగుతుంది…ప్రజలు అప్రమత్తంగా ఉండండి: వాతావరణ శాఖ
అమరావతి (న్యూస్ వెలుగు ): ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ద్రోణి కొనసాగుతుంది.తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించింది . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , శనివారం(13-09-2025) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Was this helpful?
Thanks for your feedback!