రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. వైఎస్‌ జగన్‌ ఆవేదన

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. వైఎస్‌ జగన్‌ ఆవేదన

అమరావతి;  ప్రేమోన్మాది చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన సహాన కుటుంబసభ్యులకు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లిన జగన్‌.. ముందుగా మార్చురీలో సహాన మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సహాన కుటుంబ కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని అన్నారు. ఓ దళిత చెల్లి బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీన్‌తో పాటు మరికొందరు ఆమెను తీసుకెళ్లారని పేర్కొన్నారు. సహాన శరీరంపై గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు భరోసా ఇచ్చామని తెలిపారు. దిశ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో చూశామని అన్నారు. ప్రభుత్వంనుంచి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి తోడుగా ఉండలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని జగన్‌ అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని మండిపడ్డారు. నిందితుడు నవీన్‌ టీడీపీకి చెందిన వాడు అని అన్నారు. చంద్రబాబుతోనూ నిందితుడు ఫొటోలు దిగారని చెప్పారు. అందుకే నవీన్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నిందితుడిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి సహాన ఘటనే నిదర్శమని పేర్కొన్నారు.

గుంటూరులో సహాన కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్‌.. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలుకు బయల్దేరి వెళ్లారు. ప్రేమోన్మాది పెట్రోలు పోసి నిప్పు పెట్టడంతో ఇంటర్‌ విద్యార్థిని కుటుంబ సభ్యులను జగన్‌ పరామర్శించనున్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS