
కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు ఏమి లేవు..
ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు.
ఎలాంటి తవ్వకాలు జరగడం లేదు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
కర్నూలు, న్యూస్ వెలుగు; దేవనకొండ మండలం , కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలలో యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోరు తవ్వకాలు జరగడం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ బుధవారం తెలియజేశారని, కర్నూలు జిల్లా ఎస్పీ జి . బిందు మాధవ్ తెలిపారు.ఈ విషయాన్ని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమనించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.ఎవరైనా ఈ విషయాన్ని అనవసరంగా ప్రజలను భయాందోళనకు గురిచేసే వారిపై, సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.