ఉపాధి హామీ పనుల కల్పనలో అలసత్వం ఉండకూడదు

ఉపాధి హామీ పనుల కల్పనలో అలసత్వం ఉండకూడదు

ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చాంధ్ర-స్వచ్ఛ దివస్

వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి

రీ సర్వే గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను జనవరి చివరి నాటికి పరిష్కరించాలి

ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే ను వేగవంతం చేయండి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వం
సంకల్పించిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.. శుక్రవారం కలెక్టరేట్ నుండి స్వచ్ఛ దివస్, హౌసింగ్,రెవెన్యూ సదస్సులు, పిజిఆర్ఎస్, ఉపాధి హామీ తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 18వ తేదీ మూడవ శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు కడప జిల్లా మైదుకూరులో ప్రారంభిస్తున్నారన్నారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక థీమ్ తో మూడవ శనివారం పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా జనవరి మాసంలో “న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ట్” అన్న థీమ్ తో స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు.. ప్రతి గ్రామంలో బహిరంగ ప్రదేశాలయిన బస్ స్టాప్ లు, మార్కెట్ యార్డ్ లు, చెత్త ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, డ్రెయిన్స్ ను శుభ్రం చేయడం, పబ్లిక్ టాయిలెట్స్ ను శానిటైజ్ చేయడం, పిచ్చి మొక్కలను తీసి వేయడం వంటి శుభ్రపరిచే కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఈ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీ, పంచాయతీల్లో ఉన్న పెద్ద చెత్త కుప్పలను తొలగించి వాటిని చెత్త సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈఓపిఆర్డి, ఎంపిడిఓలు, పంచాయతీ సెక్రటరీ లను ఆదేశించారు…. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు నిర్వహించాలని, క్యాంపెయిన్ మోడ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎన్జీఓలు, పాఠశాల, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనేలా ఎంపిడిఓలు, తహశీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యాలయాల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఫిబ్రవరి మాసంలో “సోర్స్ – రిసోర్స్” అనే థీమ్ తో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీలకు పనులు కల్పించడం లో అలసత్వం ఉండకూడదన్నారు.. మంత్రాలయం, గూడూరు, గోనెగండ్ల, కోసిగి మండలాలలో కూలీలు వలసలకు వెళుతున్నారనే వ్యతిరేక కథనాలు పత్రికల్లో వస్తున్నాయని, సంబంధించిన గ్రామాలను సందర్శించారా? పనులు కల్పిస్తున్నప్పటికీ కూలీలు వలసలకు వెళ్తున్నారా? పనులు కల్పించకపోవడం వల్ల వారు వలసలకు వెళుతున్నారా? సంబంధింత గ్రామాల్లో ఎన్ని సెల్ఫ్ ఆఫ్ వర్క్ లను కేటాయించారు? అన్న వివరాల ను కలెక్టర్ ఎంపిడిఓ లను అడిగి తెలుసుకున్నారు.. పత్రికల్లో కూలీలు వలసలకు వెళ్తున్నారని వార్తలు వచ్చినప్పుడు, వెంటనే స్పందించి సంబంధిత గ్రామాలను సందర్శించి, వలసలను వెళ్లవద్దని, ఉపాధి పనులను కల్పిస్తామని భరోసా కల్పించాలని, గ్రామాల్లో ఈ విధమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ప్రతి గ్రామ పంచాయతీలో పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.. పెండింగ్ లో ఉన్న గోకులం లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు..
ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించి అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్ లో ఉన్న టాయిలెట్ నిర్మాణాలు, త్రాగు నీటి వసతుల కల్పన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.. ప్రధానంగా యాస్పిరేషనల్ బ్లాక్ ల లో పెండింగ్ ఉన్న పనులను ముందుగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..
రానున్న వేసవి లో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు వీలుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.. గ్రామాల వారీగా మరమ్మత్తులకు అవసరమైన నిధులు, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఏ గ్రామాలకు నీరు అందిస్తున్నామన్న పూర్తి వివరాలతో యాక్షన్ ప్లాన్ అందచేయాలని కలెక్టర్ సబ్ కలెక్టర్, ఆర్డీవో లను ఆదేశించారు.. ఈ అంశంపై సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పిజిఆర్ఎస్ కి సంబంధించి రీ సర్వే జరిగిన గ్రామ సభలో వచ్చిన అర్జీలలో కేవలం 60 శాతం అర్జీలు మాత్రమే పరిష్కరమయ్యాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు…. పెద్ద కడుబూరు మండలంలో ఎక్కువ అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, మండల సర్వేయర్ మెటర్నిటీ లీవ్ లో ఉన్నపుడు ఆ స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని కలెక్టర్ ఏడి సర్వే , పెద్ద కడుబూరు తహసిల్దార్ లను ప్రశ్నించారు. వారం లోపు పెండింగ్ లో ఉన్న అర్జీలను డిస్పోస్ చేయాలని కలెక్టర్ పెద్ద కడుబూరు తహసిల్దార్ ను ఆదేశించారు.. అదే విధంగా అర్జీల వివరాలను తీసుకొని రావాలని కలెక్టర్ పెద్ద కడుబూరు తహసిల్దార్ ను ఆదేశించారు..అలాగే కౌతాళం లో కూడా ఎక్కువ పెండింగ్ లో ఉన్నాయని, ఆ వివరాలను కూడా తీసుకుని రావాలని కలెక్టర్ కౌతాళం తహసిల్దార్ ను కూడా ఆదేశించారు.. మంత్రాలయం, హోళగుంద, కర్నూలు రూరల్ , ఓర్వకల్లు, వెల్దుర్తి , ఆస్పరి, దేవనకొండ, హాళహర్వి , నందవరం, ఎమ్మిగనూరు, సి.బెలగల్ మండలాల్లో కూడా పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత మండల తహసీల్దారులను ఆదేశించారు..
హౌసింగ్ కు సంబంధించి జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉందన్నారు.. ఇళ్ల నిర్మాణాలలో కొన్ని మండలాల్లో పురోగతి బాగుందని, కొన్ని మండలాల్లో మరింత ప్రగతిని సాధించాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు..ఆలూరు, హాలహర్వి, ఆదోని, ఆదోని అర్బన్, గోనెగండ్ల, హోళగుంద మండలాల్లో కేవలం 40 శాతం పురోగతి మాత్రమే సాధించారని, చిప్పగిరి, మంత్రాలయం, నందవరం, పత్తికొండ మండలాల్లో కూడా 50 శాతం పురోగతి మాత్రమే సాధించారని, అయా మండలాల ఎంపిడిఓలు ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు…అలాగే ఆప్షన్-3 కింద చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి పురోగతిలో వెనుకబడిన మండలాల్లో నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పంచాయతీ రాజ్ సిసి రోడ్ల నిర్మాణాలకు సంబంధించి గోనెగండ్ల, ఓర్వకల్లు, చిప్పగిరి, హాలహర్వి, ఎమ్మిగనూరు మండలాల్లో సిసి రోడ్లు నిర్దేశించిన సమయానికి 100 శాతం పూర్తి చేశారని, ఆయా సదరు మండలాల అధికారులను కలెక్టర్ అభినందించారు. మిగతా మండలాలకు సంబంధించి ఎంపిడిఓలు, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు సమన్వయంతో పని చేసి వారంలోపు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. రానున్న రోజుల్లో మిగతా పనులకు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, వాటిని కూడా మార్చిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే ప్రారంభించి నెల రోజులైనప్పటికీ పురోగతి లో చాలా వెనుకబడి ఉన్నామని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ అంశంపై మండల స్పెషల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు…
క్యాస్ట్ సర్వే కు సంబంధించి షెడ్యూల్ ప్రకారం జనవరి 20వ తేది లోపు వచ్చిన అర్జీలను పరిష్కరించి సచివాలయాలలో లిస్ట్ పబ్లిష్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. గోనెగండ్ల, కర్నూల్ అర్బన్, ఆదోని, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరిలో పెండింగ్ ఉన్నాయని, వీటిని ఆన్లైన్ లో నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించి, లిస్ట్ పబ్లిష్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ సచివాలయ సర్వీసులకు సంబంధించి మిస్సింగ్ సిటిజన్స్ కి సంబంధించి కౌతాళం, కోసిగి, కర్నూలు (అర్బన్), ఆదోని, ఆదోని (రూరల్) మండలాల్లో ఎక్కువ శాతం పెండింగ్ లో ఉందని, డ్రైవ్ మోడ్ లో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.. రైస్ కార్డ్స్, జియో కోఆర్డినేట్స్, పంచాయతీ అసెట్స్ క్యాప్చర్ తదితర అన్ని అంశాల్లో పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు .
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, హౌసింగ్ పిడి చిరంజీవి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!