పాఠశాలలు బలోపేతం అయ్యేలా ప్రతిపాదనలు ఉండాలి

పాఠశాలలు బలోపేతం అయ్యేలా ప్రతిపాదనలు ఉండాలి

     జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు;  పాఠశాలలు బలోపేతం అయ్యేలా ప్రతిపాదనలు ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.. గురువారం పాఠశాలల బలోపేతం – రీస్ట్రక్చరింగ్ అంశం పై కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కర్నూలు నియోజకవర్గ స్పెషల్ అధికారులతో, డిప్యూటీ విద్యాశాఖాధికారులతో, మండల విద్యాశాఖాధికారులతో కలెక్టర్ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మండల విద్యా శాఖాధికారులతో మాట్లాడుతూ విద్యా శాఖ రూపొందించిన గైడ్లైన్స్ ప్రకారం పాఠశాల విద్యా వ్యవస్థ బలోపేతం అయ్యేలా ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు..ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కర్నూలు నియోజకవర్గాలకు సంబంధించిన క్లస్టర్ల వారీగా పాఠశాలలు, విద్యార్థుల వివరాలను మండల విద్యా శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు..సమావేశంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, డిఈఓ శామ్యూల్ పాల్, డిఆర్డిఎ పిడి నాగశివలీల, డి పి ఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!