
రాజధానిని త్రీడీలో చూపించి మోసం చేశారు : వైఎస్ షర్మిల
అమరావతి న్యూస్ వెలుగు : ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ , సీఎం చంద్రబాబు పై విమర్శనా అశ్రలను సంధించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? అని విమర్శించారు. ప్రధాని మోడీ తెలుగు ప్రజల ఆకాంక్ష రాజధాని అమరావతిపై 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని , రాజధాని నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు , ప్రధాని నరేంద్ర మోడీ త్రీడీలో చూపించి మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారన్నారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీ కి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామన్నారు. మోడీ 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు మర్చిపోయారా ?లేక మాయమయ్యాయా అని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా చేసిన మోసంపై సీఎం చంద్రబాబు ,మోడీ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. మోడీ ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేసారు. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలని వైస్ షర్మిల నిలదీశారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు.
ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలన్నారు. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలి దీనికి మోడీ షూరిటీ ఇవ్వాలని వైస్ షర్మిల డిమాండ్ చేశారు . అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని , 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లు తెలిపారు.