ఆభరణాలు దోచుకున్న తర్వాత.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దొంగలు

ఆభరణాలు దోచుకున్న తర్వాత.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దొంగలు

భువనేశ్వర్‌: ఒక అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన దొంగలు ఒక మహిళను బెదిరించి ఆమె ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెను చంపుతామని బెదిరించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Burglars gang rape woman) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 30న తెల్లవారుజామున 2 గంటలకు భువనేశ్వర్‌లోని మైత్రి విహార్‌లో ఒక ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. రెండేళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్న 27 ఏళ్ల మహిళను కత్తితో బెదిరించారు. మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల కుమార్తెను చంపుతామని బెదిరించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా, బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఆ మహిళ 10 రోజుల క్రితమే ఆ ఫ్లాట్‌లోకి మారిందని పోలీసులు తెలిపారు. దొంగలు వెదురు కర్రల సహాయంతో ఆమె అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ బిల్డింగ్‌ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లోని ఫుటేజ్‌ను పరిశీలిసున్నట్లు పోలీస్‌ అధికారి చెప్పారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!