తిరుపతి ఘటన అత్యంత బాధాకరం

తిరుపతి ఘటన అత్యంత బాధాకరం

  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళి కృష్ణ

కర్నూలు, న్యూస్ వెలుగు ;  తిరుపతి ఘటన అత్యంత బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పీ మురళీకృష్ణ అభిప్రాయ పడ్డారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మృతుల కుటుంబాలకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియ జేస్తున్నామని దేవస్థానం చరిత్రలో తొలిసారి విషాద సంఘటన అని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటనకు కారణం కావచ్చు అని మృతుల కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమనీ ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని, వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!