
వైసిపి నాయకుడి మృతికి నివాళి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో వైసిపి నాయకులు సోమిరెడ్డి బకాడి సోమిరెడ్డి అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు మరియు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ఆదివారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం మట్టి ఖర్చులకు తన వంతుగా రూ.10000/- ఆర్థిక సాయం అందజేశారు.అదేవిధంగా ఎల్లార్తి గ్రామంలో మృతి చెందిన మాజీ సర్పంచ్ మాల వైకుంఠం మృత దేహాన్నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి తనయుడు ఈసా,వైసిపి నాయకులు జయన్న తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!