ట్రూఆప్ చార్జీలు స్మార్ట్ మీటర్లు ఆదానితో సోలార్ ఒప్పందం రద్దు చేయాలి-సిపిఎం

ట్రూఆప్ చార్జీలు స్మార్ట్ మీటర్లు ఆదానితో సోలార్ ఒప్పందం రద్దు చేయాలి-సిపిఎం

కర్నూలు, న్యూస్ వెలుగు; 2025 26 సంవత్సరాలకు సంబంధించి ఏ.ఆర్.ఆర్  టారిఫ్ ప్రతిపాదనలపై పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా ప్రజలు అభ్యంతరాలు తెల్పడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ముందు జిల్లా కమిటీ సభ్యులు నగేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. డి.ఈ కి వినతి పత్రం అందించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి. రాముడు, నంద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరరావు,వి.యేసురత్నం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు ఎం.విజయ్ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని, ట్రూ ఆఫ్ చార్జీలను సర్ చార్జీలను రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికి నేడు అధికారంలోకి వచ్చాక ఆరు నెలల కాలంలోనే దాదాపు 18 వేల కోట్ల రూపాయలను ట్రూ అప్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడానికి సిద్ధపడ్డారు ఇప్పటికే 6072 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమన్న పెద్దమనిషి ఈరోజు వేగంగా రైతుల బోర్ల బావులకే కాకుండా ఇండ్లకు కూడా కావాల్సినన్ని స్మార్ట్ మీటర్లను కొని దొంగ దారిన బిగిస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆదాని సోలార్ ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల ముడుపులు ముట్టాయని అమెరికాలో కేసు నమోదైనప్పటికీ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం బిజెపి జనసేన ప్రభుత్వం ఆ అవినీతి ఒప్పందాన్ని రద్దు చేయకుండా కొనసాగించడానికి ఈ పెద్ద మనుషులు ఎన్ని ముడుపులు తీసుకున్నారని ప్రశ్నించారు. అలాగే విద్యుత్తు పంపిణీ సంస్థలు విద్యుత్ మిగులు భవిష్యత్తు అవసరాలపై తప్పుడు తడకలతో అంచనాలు రూపొందించడం సరైంది కాదు అలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం గుడ్డిగా ఆమోదించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వము ప్రభుత్వం చెల్లించవలసిన సబ్సిడీలను కుదించి చూపి భవిష్యత్తులో సర్దుబాటు చార్జీలపై భారం మోపడానికి వాస్తవ విరుద్ధ ప్రతిపాదనలను ప్రజల ముందు ఉంచుతున్నారని ఈ ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల బడా కంపెనీలకు మేలు చేసే విద్యుత్ విధానాలు అమలవుతున్నాయి అన్నారు ప్రజలపై రోజురోజుకి పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల భారము భారీగా పెరిగిన నిరుద్యోగము పేదరికము తో సతమతమయ్య ప్రజలపై విద్యుత్ బారాలు వేయటం సిగ్గుచేటని అన్నారు. ఏనాడో వాడిన కరెంటుకు ఏళ్లు గడిచిపోయాక నేడు అదనంగా చార్జీలు చెల్లించాలన్న గతంలో వేసిన ట్రోప్ చార్జీలను రద్దుచేసి కొత్తగా భారాలు వేయవద్దని, స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఆదాని సంస్థతో చేసుకున్న ఎఫ్ పి పి సి ఆర్ సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని 2025-2026 సంవత్సరంలో సర్దుబాటు చార్జీల పేరుతో ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం వేయవద్దని డిమాండ్ చేశారు. ప్రజలపై బారాలేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని మరో 2001 విద్యుత్ పోరాటాన్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.నరసింహులు మాట్లాడారు. నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప, ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.ఎం.డి షరీఫ్, అబ్దుల్ దేశాయ్, రామకృష్ణ,యేసు,ఉశేన్ బాషా,శేషాద్రి,శ్రీను,సత్యం.సాయి,మురళి, మహిళా నేతలు పి.ఎస్ సుజాత, కే.ఎస్ పద్మ,జయమ్మ,సావిత్రి,లక్మిదేవి, రెండు నగర కమిటీల సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!