
తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నగేష్ యాదవ్
తుగ్గలి, న్యూస్ వెలుగు: తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ యాదవ్ తెలియజేశారు.జిల్లాలో అత్యంత వెనుకబడిన తుగ్గలి మండలాన్ని ప్రభుత్వము కరువు మండలంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నగేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం తుగ్గలి, రాతన,అమీనాబాద్,ఉప్పర్లపల్లి తదితర గ్రామాలలోనే నల్లరేగడి పొలాల్లో రబీ కింద సాగుచేసిన పప్పుశనగ,జొన్న, తదితర పంటలు పూర్తిగా దిగుబడి రాక రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆయన అన్నారు.కనీసం ఈ ప్రాంతానికి ఎలాంటి సాగునీరు లేదని,మొత్తం వర్షాధారం పైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని అన్నారు.అయితే ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం చాలా బాధాకరమన్నారు.ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి కరువు మండలంగా ప్రకటించేదాకా రైతులతో కలిసి వైఎస్ఆర్సిపి పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతామని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి,మండల వైసిపి నాయకులతో చర్చించి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నాగేష్ యాదవ్ తెలియజేశారు.