పేదలకు ఎలాంటి షరతులు లేకుండా రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి

పేదలకు ఎలాంటి షరతులు లేకుండా రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పాత బస్టాండ్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న సచివాలయం ముందర సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగినది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి
డి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ
నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలోని నిరుపేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయాలని అలాగే
ఆ రెండు సెంట్లలో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇసుక సిమెంట్ స్టీలు ఫ్రీగా ప్రభుత్వమే సప్లై చేయాలని ఆస్థలాల ని కూడా పేద ప్రజలు నివాసయోగ్యంగా ఉండే ప్రాంతాలలో స్థలాలు ఇవ్వాలని నగరానికి సుదూర ప్రాంతాలలో ఇవ్వకూడదని అలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మాత్రం ప్రభుత్వ భూములలో సిపిఐ జెండాలు పాతి పేదలకు రెండు సెంట్ల స్థలం కమ్యూనిస్టు పార్టీగా మేమే ఇస్తామని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పట్టణ ప్రాంతంలో పేదలకు ఒక్కొక్క సెంటు మాత్రమే ఇచ్చారని
ఈ విధానాన్ని రద్దుచేసి వారికి కూడా రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు నాగరాజు సిపిఐ నాయకులు భీముడు రాముడు శీను శివుడు భాష మరియు వడ్డగేరి ఆర్కే స్ట్రీట్ డబ్బురా ప్రాంతాల నుండి అల్లాబునాజీమా మంగమ్మ శాంతి లక్ష్మి రేణుక హెచ్ రాజు శకున్ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!