
అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్ చేయాలి
ప్రభుత్వం నిబంధనలు పాటించని హాస్పటలపై చర్యలు తీసుకోవాలి; ఏఐవైఎఫ్
న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్లను సీజ్ చేయడంలో , ప్రభుత్వ నిబంధనలు పాటించని హాస్పిటల్ పై చర్యలు తీసుకోవడంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం విడనాడి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు నగర కార్యదర్శి బీసన్న డిమాండ్ చేశారు .
శుక్రవారం నాడు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి నగర అధ్యక్షులు బాబయ్య అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు బిసన్నలు మాట్లాడుతూ డిఏం & హెచ్ ఓ కార్యాలయానికి కూత వేటు దూరంలో పదుల సంఖ్యలో డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే అర్హత లేనటువంటి వ్యక్తులు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా వీటి పైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఇద్దరు డిఎం & హెచ్ ఓ మారిపోయారు తప్ప డయాగ్నొస్టిక్ సెంటర్ లపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు .ఇదే అదునుగా ప్రవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్ విచ్చలవిడిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నానని వారు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా కొత్త బస్టాండ్ సమీపంలోనే యశోద నర్సింగ్ హోమ్ లో ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్ చేశారని ఆరోపణల పైన జులై 27వ తేదీన డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం సమర్పించిన ఇప్పటివరకు దానిపైన విచారణ జరపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని అదేవిధంగా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఏఎన్ఎం నర్సు సక్రమంగా విద్యులకు హాజరు కావట్లేదని దీనిపైన విచారణ జరిపించాలని డిఎంహెచ్ఓ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ వీటి పైన చర్యలు తీసుకోలేదని ఇలా ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ పైనే కాకుండా వైద్య విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నర్సుల పైన కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారంటే అసమర్ధతనా ?లేదంటే వారిచ్చే ముడుపులకి ఆశపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని కావున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం పైన కలెక్టర్ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.