
కంది పంటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని కడుమకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని గల రోల్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం రోజున కంది పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.పసేద్దుల శాంతయ్య,కుమారుడు పసేద్ధుల ఆనంద్ కుమార్ ఇద్దరు ఆరెకరాల కంది పంటను పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేశారు. చేతికొచ్చిన పంటను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పంట పూర్తిగా కాలిపోయిందని రైతులు వారు ఆవేదన వ్యక్తం చేశారు.నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu