యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలి

 యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; 2019లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, మహానంది, రుద్రవరం మండలాలలోని నల్లమల అడవులలో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలని ఆనాడు ప్రజలు, విద్యార్థులు, మేధావులు తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో పక్కన బెట్టారు. మరి తిరిగి ఇప్పుడు కర్నూల్ జిల్లాలోని దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం అన్వేషణ ప్రతిపాదన తిరిగి ముందుకు వచ్చింది.  యురేనియం తవ్వకాల వలన ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. ఊపిరితిత్తులు, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలాగే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ప్రజలకు, ప్రకృతికి విఘాతంగా పరిణమిస్తాదని తెలిసినప్పటికీ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు పూనుకొంటున్నాయి.కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వ సహకారంతో, పాలక పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనం కోసం, తన మార్కెట్ విస్తరణ కాంక్షతో యురేనియం తవ్వకాలు చేపట్టాలని భావిస్తోంది. అందుకోసం ప్రకృతికి, సమాజానికి హాని జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రోజురోజుకు తరిగిపోతున్న అడవులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వాటిని నాశనం చేస్తున్నాయి. యురేనియం నిల్వలు అంచనా వేసేందుకు జరిపే తవ్వకాల వల్ల కప్పట్రాళ్ల ఆటవీ ప్రాంతం నాశనం అవుతుందని, భూగర్భజలాలు, తాగునీరు విషతుల్యం అవుతాయని స్థానిక ప్రజలు ఆందోళన పడుతున్నారు. అరుదైన జీవరాసులు, వృక్షసంపద ప్రమాదంలో పడి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. కావున యురేనియం అన్వేషణ ప్రయత్నాలు మరియు తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని. అడవులని కాపాడాలని SUCI(C) పార్టీ జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!