వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ పనులను పూర్తి చేయాలి

వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ పనులను పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

న్యూస్ వెలుగు, కర్నూలు; జనవరి 8వ తేదీ లోపు వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా డిఈఓ ను ఆదేశించారు.సోమవారం స్థానిక సుంకేసుల రోడ్డు లో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ హాల్ పైన వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు కొరకు జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 9వ తేదిన రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రి వర్యులు వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించనున్నారన్నారు.. వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు కి సంబంధించి పెండింగ్ లో పార్టిషన్, సీలింగ్, ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్ ల ఏర్పాటు తదితర పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్ అండ్ బి ఎస్ఈ లను ఆదేశించారు.. అదే విధంగా పాఠశాలల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు బోధనకు వీలుగా ఇంటర్నెట్ కనెక్షన్, స్పీడ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, జిల్లా విద్యా శాఖ అధికారి పాల్, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!