జిల్లా నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం

జిల్లా నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం

     టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నాటక ప్రభుత్వ తుంగబద్రనదిపై కుంబళనూరు- చిలకలపర్వి మద్య నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి కమ్ భ్యారేజి నిర్మించేందుకు చేస్తున్నటువం టి ప్రయత్నాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్ట అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వ్యతిరేకించారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో కు డా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయమై స ్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తుంగభద్ర నదిపై కర్నాటక ప్రభుత్వం కౌతాళం మండలం కుంటళనూరు- చిలకలపర్వి మధ్య 0.35 టీఎంసీల సామర్థ్యంతో బిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తుంది. మంత్రాలయం -చిన్నమందాల మధ్య 0.31 టీఎంసీల సామర్థ్యంతో మరో బిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం కోసం ప్రమత్నాలు చేస్తుంది. తుంగభద్ర డ్యాంకు 144 కిలోమీటర్ల దూరంలో కుంటళనూరు చిలకలపర్వి బ్యారేజీ నిర్మాణం చేయాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ బిడ్జి కమ్ బ్యారేజీ వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని.. చుక్క నీరు కూడా తీసుకోమని కర్ణాటక ఇంజనీర్లు చెబుతున్నారు. వాళ్ల మాటలు నమ్మలేం.. ఎందుకంటే.. బ్యారేజీ నిర్మాణం చేసిన తరువాత… కర్ణాటక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్రమంగా తుంగభద్ర జలాలు అక్రమంగా తరలించుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గంలోని నదీతీర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కేసీ కాలువ నీటి వాటా 31.90 టీఎంసీలు విఖర జలాలు ఉంటే.. 10 టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి, 21.90 టీఎంసీలు నదీ ప్రవాహం వరద నుంచి తీసుకోవాలి, కర్ణాటక చిలకలపర్వి -కుంబళనూరు మధ్య బిడ్జి కమ్ బ్యారేజ్ కడితే… సాంప్రదాయ వరద దిగువకు రాదు.. తద్వారా కేసి ఆయకట్టు సాగు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం సాగునీటి విషయము ఏమోగాని వర్షాబావ పరిస్థితులు ఏర్పడినుప్పుడు కనీసం త్రాగునీరు కూడా దొరికే పరిస్థితి ఉండదని అందోళన వ్యక్తపరిచారు.

* కంతేకాదు.. కుంటళ్ళనూరు ఎగువన చారిత్రాత్మకమైన రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది.. ఆలయానికి వెళ్లే దారి నీటిలో మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిలకలపర్వి – కుంబళనూరు బ్యారేజ్ కమ్ బడ్జి నిర్మాణాన్ని అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది అంతర్ రాష్ట్ర జల వివాదంగా మారే అవకాశం ఉండడంతో.. నిజంగా కర్ణాటకకు చిత్తశుద్ధి ఉంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించాలి. * తుంగభద్ర జలాలు వినియోగంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మూడు రాష్ట్రాల జలవనరుల నిపులణుతో కమిటీ వేసి.. ఆ కమిటీ నివేదిక ఆధారంగా.. కేంద్ర జల సంఘం ఆమోదంతోనే ముందుకు వెళ్లాలి. అలా కాకుండా… కర్ణాటక రాష్ట్రం మైనర్ ఇరిగేషన్ ఈఈ స్థాయి ఇంజనీర్లు వచ్చి.. కర్నూలు జిల్లా ఇంజనీర్లతో మాట్లాడడం సరైంది కాదు.. మన ఇంజనీర్లు కూడా వాళ్లతో చర్చలు జరపడం మంచి సంప్రదాయం కాదు.. ఇది మూడు రాష్ట్రాల జల సమస్య. ప్రభుత్వంతో మాట్లాడమని తేల్చి చెప్పి సంపాల్సి ఉండేది. జిల్లా, రాయలసీమ రైతులకు అన్యాయం చేసే కర్ణాటక చేపట్టి ఇలాంటి అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటాం. ఈ విషయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఐటీ మంత్రి, యువనేత నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లాను. జిల్లా నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జగన్ 2.0 ఫార్ములా గురించి మాట్లాడుతుంటే సెల్ఫాన్ గుర్తుకు వస్తుంది. జగన్ 5 సంవత్సరాల విధ్వంసపాలన కారణంగానే ప్రజలు వారిని చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు. అయినా జగన్కు ఇంకా జ్ఞానోదయం కలుగలేదు. తాను 2.0 పార్ములాతో అధికారంలోకి వస్తాను 30 ఏండ్లు సి.యం.గా నేనే ఉంటాను అంటూ గ్రల్పాలు పలికారు. నీవు రాష్ట్ర ప్రజలకు ఏమి :పయోజనం చేకూర్చావని నిన్ను చేరదీస్తారు. చంద్రబాబు గారు అభువం ఉన్న కారణంగా రాష్ట్రంలో నీవు సాగించిన విధ్వంసపా లననుండి ఇప్పుడిప్పుడే రాక్షష్టాన్ని గాడిలో పెడుతున్నారు. ఇక నీవు శాశ్వితంగా రాజకీయాలకు స్వస్తిచెప్పాలి. లేదా మీ పాతగూటికి చేరాలి తప్ప నీ పార్టీని, నిన్ను ప్రజ లు నమ్మేస్థితిలో లేరనీ వివరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె. నాగేంద్ర, వై. నాగేశ్వరరావుయాదవ్, పి.రవికుమార్, జె. తిరుపాల్ బాబు, ఎల్లప్ప, యస్, ముంతాజ్, “

Author

Was this helpful?

Thanks for your feedback!