కౌలు రైతులకు రుణాలు అందిస్తాం

కౌలు రైతులకు రుణాలు అందిస్తాం

  ఏ.కోడూరు ఎస్బిఐ మేనేజర్ నాగరాజు

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు : మండలంలోని ఏ కోడూరు గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి స్వాతి ఆధ్వర్యంలో ఏ.కోడూరు బ్యాంక్ మేనేజర్ నాగరాజు రైతు భరోసా కేంద్రంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ
భూమి కౌలు తీసుకొని సాగు చేస్తున్న ప్రతి ఒక్కరు కౌలు గుర్తింపు కార్డు తీసుకోవాలన్నారు. కౌలు పత్రాలు పొందిన వారికి బ్యాంకు నుండి 1.60వేల రూపాయల వరకు పంట రుణం అందిస్తామన్నారు. సాగు చేసిన పంటను వారి పేరుతో నమోదు చేస్తామన్నారు.కౌలు తీసుకున్న పొలం పై బ్యాంకులలో ఎటువంటిరుణాలుఉండకూడదన్నారు.పంట కాలం పూర్తయిన తర్వాత తీసుకున్న అప్పును బ్యాంకుకు చెల్లించాలన్నారు. సకాలంలో అప్పు చెల్లిస్తే మళ్లీ 11 నెలల తర్వాత రైతు కౌలు పత్రాలు ఆధారంగా రుణం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగశేషులు రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!