రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎల్లార్తి దర్గా అభివృద్ధి చేస్తాం

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎల్లార్తి దర్గా అభివృద్ధి చేస్తాం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం.
వక్ఫ్ బోర్డు సూపరిడెంట్ మహమ్మద్ హుసేన్

హోళగుంద, న్యూస్ వెలుగు : ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎల్లార్తి దర్గా అభివృద్ధి చేసి,భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నీ వసతులు కల్పిస్తామని వక్ఫ్ బోర్డు సూపరిడెంట్ మహమ్మద్ హుసేన్ తెలిపారు. శనివారం ఎల్లార్తి గ్రామంలో వెలిసిన రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన హజరత్ షేక్షవలి,షాషావలి దర్గాల హుండీ లెక్కింపు చేపట్టారు.4 నెలలకు గాను రూ.7,72,650 రూపాయలు హుండీ ఆదాయం వచ్చిందని దర్గా ఈఓ షేఖ్.ఇమ్రాన్ తెలియజేశారు.ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సూపరిడెంట్ మహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ గతంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వల్ల దర్గాలలో అభివృద్ధి జరగలేదని,ప్రస్తుత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాలతో దర్గాలలో రూములు,టాయిలెట్లు వంటి వసతులు కల్పిస్తామని అన్నారు.అదేవిధంగా దర్గాలలోని హుండీల పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తామన్నారు.2014 సంవత్సరంలో ఎల్లార్తి దర్గాలను వక్ఫ్ బోర్డు ఆధీనంలో తీసుకోవడం జరిగిందని అప్పటినుండి నేటి వరకు అన్నీ ఖర్చులు పోగా 56 లక్షల రూపాయలు ఖాతాలో జమ ఉన్నాయని,ఈ నిధులతో భక్తులకు రూములు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.దర్గాల నిర్వహణకు ఇటీవల టెండర్ నిర్వహించడం జరిగిందని,11 నెలల 15 రోజులకు గాను రూ 1.75 కోట్లకు ఎల్లార్తి గ్రామానికి చెందిన బి.మల్లికార్జున టెండర్ దక్కించుకోవడం జరిగిందని చెప్పారు.టెండరు దక్కించుకున్న వారు మార్చి 3 వ తేదీన టెండర్ పాడిన మొత్తంలో నుండి 25% చెల్లించాల్సి ఉంటుందన్నారు.టెండరు దక్కించుకున్న వారికి హుండీ, జుబాల పై ఎలాంటి అధికారులు ఉండవన్నారు.అదేవిధంగా గ్రామస్తులు వక్ఫ్ బోర్డ్ అధికారులు ఎల్లార్తి దర్గాల ఆదాయం తీసుకెళుతున్నారు. అయితే దర్గా అభివృద్ధి మాత్రం శూన్యమని అధికారులతో వాగ్వివాదానికి దిగారు.గతంలో జరిగిన పొరపాట్లు,అవకతవకలు పునరావృతం కాకుండా చూస్తామని వక్ఫ్ బోర్డు అధికారులు అన్నారు.దర్గాలలో అవినీతికి తావు లేకుండా దర్గాల అభివృద్ధికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కట్టుబడి ఉన్నారని,దర్గాలలో అవినీతిని కట్టడి చేసి ఖచ్చితంగా దర్గాలను అభివృద్ధి పరుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో దర్గా ఈఓ ఇమ్రాన్,ఆదోని డివిజన్ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సుహెల్,వక్ఫ్ బోర్డు అధికారులు ముక్తర్ అహ్మద్,వక్ఫ్ బోర్డు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.హుండీ లెక్కింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రైనీ ఎస్సై మహబూబ్ బాషా,పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!