
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 93 ఫిర్యాదులు.
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 93 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 3 లక్షలు తీసుకొని బెంగుళూరు కు చెందిన మనీషా జాబ్ కన్సల్టెన్సీ పేరుతో మోసం చేసిందని కర్నూలు, ఎన్ ఆర్ పేట కు చెందిన సమీర్ ఫిర్యాదు చేశారు.
2) నా కుమారుడు రాజు ప్రతి రోజు మద్యం సేవించి వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు , మద్దూర్ నగర్ కు చెందిన అన్నమ్మ ఫిర్యాదు చేశారు.
3) హైదరాబాద్ లో గుడ్ క్రాప్ ఐటి సోల్యూషన్స్ ప్రవేట్ లిమిటెడ్ కు చెందిన చంద్రశేఖర్ నాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ. 2 లక్షల 60 వేలు తీసుకొని, 3 నెలల పాటు పని చేయుంచుకుని జీతాలు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడని కర్నూలు, పార్వతి నగర్ కు చెందిన కుర్వ ఆంజనేయులు, ఈశ్వర్ చందు ఫిర్యాదు చేశారు.
4) టెలి గ్రామ్ యాప్ లో వచ్చిన ట్రేడింగ్ లింక్ ను క్లిక్ చేసి చిన్న చిన్న మొత్తాలు డిపాజిట్ చేశాను , లాభాలు వస్తున్నాయనే నమ్మకంతో పెద్ద మొత్తాలలో డిపాజిట్ చేసినప్పుడు డబ్బులు తిరిగి రాలేదని రూ. 61,600 సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయానని రికవరీ చేయించాలని కర్నూలు , ఎల్. వెంకయ్య నగర్ కు చెందిన విశ్వకార్తీక్ ఫిర్యాదు చేశారు.
5) తెలియని వ్యక్తులు నా అన్న పై దాడి చేయడంతో పాటు ఇంటికి వచ్చి దుర్భాషలాడుతున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని కర్నూలు, ఎన్టీఆర్ బిల్డింగ్స్, రాములవారి వీధికి చెందిన భవాని ఫిర్యాదు చేశారు.
6) నా పొలం ప్రక్కన ఉన్న గఫూర్ అతని పొలంలోని ఎక్కువగా ఉన్న నీళ్ళను నా పొలంలోకి వదిలి పంట నష్టం చేస్తున్నాడని వృధా అవుతున్న నీళ్ళకు అడ్డు కట్ట వేయకుండా నా పై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ప్యాలకుర్తి కి చెందిన ఖాజా బందే నవాజ్ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, సిఐ శివశంకర్ పాల్గొన్నారు.