
రజక కార్పొరేషన్ చైర్మన్ కు ఘనస్వాగతం
న్యూస్ వెలుగు, కర్నూలు; రజకుల అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని రజక ఉన్ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ సావిత్రమ్మ కర్నూలు లో తెలిపారు. చైర్మన్ గా పదవి తీసుకుని మొదటిసారి జిల్లా కు రావడంతో రజక సంఘల నాయకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ అతిధి గృహంలో మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో రజకవృత్తిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రజకులు ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. నగరాల్లో 60 రజక కుటుంబాలకు ఒక దోబి ఘాట్ ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తున్నారు. రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోతామన్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం చేశారని…. గత వైసీపీ ప్రభుత్వం లో తమకు ఎలాంటి లబ్ది జరగలేదని రజక సంఘం నాయకులు, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు తెలిపారు.రజకులు సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలంటే మూడు వేల రూపాయలు కట్టాల్సిఉండగా తెలుగు దేశం ప్రభుత్వం కేవలం పది రూపాయలకు తగ్గించిందని శ్రీరాములు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలోకి తీసుకుని వచ్చేంత వరకు తాము పోరాటం చేస్తామన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లెల్ల శ్రీరాములతో పాటు రాంబాబు, లోకేశ్వరయ్య,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.