
పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల
న్యూస్ వెలుగు విజయనగరం:
కాంగ్రెస్ పార్టీ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా గురువారం విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా నేతలతో, కార్యకర్తలతో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ధైర్యం, కేంద్రంలోని బీజేపీని ఎదుర్కునే దమ్ము ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా, రాజధాని కట్టాలన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యం. అందుకే పార్టీలో ఉన్న చిన్న, చిన్న విబేధాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగిందని వైఎస్ షర్మిల అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!