
అమ్మవారికి బంగారు డైమండ్స్ బహుకరణ
ఇంద్రకీలాద్రి , విజయవాడ:యస్ బిఐ ఆఫీసర్స్ కాలనీ, విజయవాడకు చెందిన ప్రత్యూష గొల్లపాటి వారి కుటుంబసభ్యుల ద్వారా శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా సుమారు 1.5 లక్షలు విలువ జేయు 8.7 గ్రాములు బరువు గల బంగారు డైమండ్స్ నత్తును ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు అందజేసినారు.
ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈఈ కె వి ఎస్ కోటేశ్వర రావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

Was this helpful?
Thanks for your feedback!