
మోదీ పర్యటన గ్రాండ్ సక్సెస్ అదికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
అమరావతి (న్యూస్ వెలుగు): ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో నాలుగోసారి జరిపిన పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని… వీటిల్లో కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయం దర్శనంపై ప్రధాని ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారని సీఎం వివరించారు.

Was this helpful?
Thanks for your feedback!