
రానున్న ఇదేళ్లలో న్యాయ వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది : కేంద్ర మంత్రి
డిల్లీ : రానున్న ఐదేళ్లలో దేశంలోని నేర న్యాయ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుస్తుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. కొచ్చిలోని కేరళ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల రాష్ట్ర స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. న్యాయం అనేది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని మంత్రి అన్నారు. సరైన తయారీ లేదా సంప్రదింపులు లేకుండానే భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారనే అభియోగాన్ని ఆయన తోసిపుచ్చారు. 2019 నుంచి వాటాదారులతో వివిధ స్థాయిల్లో చర్చించామని మంత్రి మీడియా ప్రతినిధులకు సమాదనమిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu