
వారంలోగ గ్రామానికి తాగునీటిని ఇవ్వాలి : డిప్యూటీ సీఎం
అన్నమయ్య జిల్లా : మైసూరావారి పల్లెలో గ్రామసభ కార్యక్రమానికి హాజరై, అక్కడి నుండి అన్నమయ్య డ్యాం నిర్వాసితులను కలవడానికి వెళ్తున్న సమయంలో, మార్గమధ్యలో ఒక పెద్దావిడ త్రాగునీటి సమస్య గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో, సమస్య తక్షణమే పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి 7-8 రోజుల్లో గ్రామానికి త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Was this helpful?
Thanks for your feedback!