న్యూస్ వెలుగు : 

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు గల్లంతు అయిన సంఘటనపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!