8 వ జాతీయస్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం

8 వ జాతీయస్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం

న్యూస్ వెలుగు, కర్నూల్; క్రీడాకారులు గెలుపోవటములను సమానంగా తీసుకుని క్రీడాలో రాణించాలని జాతీయ సంఘం అధ్యక్షుడు రవికుమార్ కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు.జాతీయస్థాయి రింగ్ ఫైట్ పోటీలు ప్రారంభం 8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలను నేడు ఆదివారం బి.క్యాంప్ లోని టీ.జీ.వి కళ్యాణమండపం నందు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ రింగ్ పైట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, ప్రభాకర్ లు ముఖ్య అతిథిలుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో జాతీయ స్థాయి పోటీలను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. క్రీడాకారులు గెలుపోవటం లను సమానంగా తీసుకొని క్రీడా పోటీలో రాణించి విజేతలుగా నిలవాలని ఆకర్షించారు. అనంతరం రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు ధర్మేంద్ర గౌడ్, అబ్దుల్లా లు మాట్లాడుతూ 18 రాష్ట్రాల నుంచి సబ్ జూనియర్,జూనియర్, సీనియర్ బాల బాలికల విభాగాలలో క్రీడాకారులు పోటీలకు హాజరైనట్లు తెలిపారు.రెండురోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని వారు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!