
పెద్ద గోనె హాల్ రెవిన్యూ సదస్సు
హోళగుంద, న్యూస్ వెలుగు: రెవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో సమయానుకూలంగా ఉపయోగపడతున్నాయని తహసిల్దార్
సతీష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్ద గో నేహ లు సర్పంచ్ వెంకటరెడ్డి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల భూ సమస్యలతో కూడిన అర్జీలను 13 స్వీకరించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగు చెందాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తమ వద్దకే అధికారులను పంపి సమస్యలు తెలుసుకునేలా చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మల్లికార్జున,వీఆర్వో ఈరన్న,దామోదర్,కంప్యూటర్ ఆపరేటర్ బసవ,గ్రామ సర్వేయర్లు,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!