
అర్హులైన బీసీలకు రుణాలు మంజూరు చేయాలి
అఖిలభారత రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షురాలు
చంద్రకళ భాయ్
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లాలోని బీసీ రుణాలు అర్హులైన వారికి ఇవ్వాలని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రకళ బాయి డిమాండ్ చేశారు .బీసీ రుణాల కొరకు బడ్జెట్లో పెంచాలని ప్రతి బిల్లుకు కనీసం ఐదువేల యూనిట్లు ఇవ్వాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదు వేల యూనిట్లు ఇస్తామని అధికారులు తెలుపుతున్నారు సుమారుగా 7వేలకు పైగా అప్లై చేసుకున్నారు బీసీ ప్రజలకు మాత్రం సరిపోవడం లేదు బీసీలు అత్యధి క జనాభా నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంది ముఖ్యంగా బ్యాంక్ అధికారులు బిసి ప్రజలకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. కావున దయచేసి బీసీలకు అర్హులైన ప్రతి వాళ్లకు రుణం మంజూరు చేయాలని చంద్రకళాబాయి తెలిపారు.