దసరా ఉత్సవాలను అధికారుల సమన్వయంతో పనిచేయాలి

దసరా ఉత్సవాలను అధికారుల సమన్వయంతో పనిచేయాలి

విజయవాడ, న్యూస్ వెలుగు ; అక్టోబర్ 3 వ తేదీ నుండి నిర్వహించనున్న దసరా శరనవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి యిబ్బందులు కలగకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. సృజన సూచించారు. దసరా మహోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జి. సృజన పోలీసు కమీషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు, కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు మునిసిపల్, రెవిన్యూ, పోలీస్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖల అధికారులుతో శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి కార్యాలయం నందు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి యేటా దసరా ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ అధికారులతో జిల్లాస్థాయి అధికారులు సమన్వయం ఉండి అప్పగించిన పనులు సకాలం లూ పూర్తి చేయాలన్నారు.పోలీస్ కమీషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపి, స్నానం ఘాట్లు, క్యూ లైన్ లు, కౌంటర్లు మరియు ఇతర రద్దీ  ముఖ్యమైన ప్రదేశాలలో నిరంతర నిఘ ఉంచుతున్నట్లు తెలిపారు.ఆలయ ఈవో కె ఎస్ రామరావు మాట్లాడుతూ దసరా నవరాత్రులలో శ్రీ అమ్మవారి చేసే అలంకారం గురించి వివరించారు. భక్తులకు త్వరితిగతిన అమ్నావారిదర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అవసరమైన ప్రదేశములలో ప్రసాదం, కల్యాణకట్ట కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.స్నానం ఘాట్లు , త్రాగు నీరు, శానిటేషన్, సెక్యూరిటీ ఏర్పాట్లు, రద్దీకి అనుగుణముగా క్యూ లైన్ ఏర్పాట్లు పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మునిసిపల్, పోలీస్, అగ్నిమాపక, వైద్య, రోడ్లు భవనాలు ఇరిగేషన్  ఇతర విభాగాముల నుండి కావలసిన ఏర్పాట్లు తదితరముల గురించి చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ తమ విభాగముల వారు గత అనుభవములు  ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సోమవారం తేది. 16-09-2024 న క్షేత్ర స్థాయిలో అన్ని విభాగముల అధికారులతో కలిసి ఇన్స్పెక్షన్ నిర్వహించబడునని, అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించబడునని తెలిపారు.కార్యక్రమంలో లా & ఆర్డర్ డిసిపి గౌతమ్ శాలి, ట్రాఫిక్ డీసీపీ కృష్ణ మూర్తి నాయుడు, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఆలయ ఈఈ లు కె వి ఎస్ కోటేశ్వరరావు, లింగం రమ, డివై ఈవో లీలా కుమార్, ఏఈఓ లు, పర్యవేక్షకులు, ఇంజినీరింగ్ అధికారులు, 1 టౌన్ ఏ సి పి, సీఐ, ఎస్ ఐ, అగ్నిమాపక, ఎలక్ట్రిసిటీ, డి.యం.ఓ.హెచ్, మునిసిపల్  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!