
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మంత్రి అనిత
విజయవాడ, న్యూస్ వెలుగు ; శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మంత్రివర్యులు వంగళపూడి అనిత.ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు .అనంతరం వేదపండితులచే ఆశీర్వచనం కల్పించి, అమ్మవారి ప్రసాదం,శేషవస్త్రం, చిత్రపటం అందజేసిన ఆలయ అధికారులు. అమ్మవారిని దర్శించుకుని, దసర ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి.హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ భక్తులకు ,ఆడవారికి ,వృద్దుకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం.టైం ప్రకారం ప్రోటోకాల్ దర్శనాలు జరుగుతాయి.అన్ని శాఖల సమన్వయంతో దసర జరుగుతుంది.ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. క్యులైన్స్ లో ఉన్నవారికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist