
సత్యం రామలింగ రాజు భారతదేశంలోని IT రంగంలో ఒకప్పుడు ఒక నక్షత్రం వెలిగి ఒక్కసారిగా కుప్పకూలిన నేత ..! సత్యం కంప్యూటర్స్ను స్థాపించి, భారతీయ IT రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన వ్యక్తిగా సత్యం రామలింగరాజు గుర్తింపు పొందారు. అయితే, తర్వాత ఆయన చేసిన అక్రమాలు ఆయన జీవితం మొత్తం మార్చేశాయి. సత్యం కంప్యూటర్స్ స్థాపకుడు 1987 హైదరాబాద్లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన క్రెడిట్ రామలింగరాజుకే దక్కుతుంది. కంపెనీ ఆదాయాలను తప్పుగా చూపించడం, అక్రమంగా డబ్బు తీసుకోవడం వంటి అనేక అక్రమాలకు పాల్పడినందుకు రామలింగరాజు జైలు శిక్ష అనుభవించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. దీంతో సత్యం కుంభకోణం భారతీయ IT రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆర్థిక నిపుణులు అంచనావేశారు. వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు అనేక మంది పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూసిన పరిస్థితి ఏర్పడింది. సత్యం కుంభకోణం నుండి నేర్చుకోవలసిన పాఠాలు పారదర్శకత కంపెనీలు తమ ఆర్థిక వ్యవహారాల గురించి పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. అక్రమాలను నియంత్రించడానికి గట్టి చట్టాలు చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Thanks for your feedback!