
బికే సింగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
రాయలసీమ యువజన పోరాట సమితి నాయకులు జాయింట్ కలెక్టర్ వినతి
న్యూస్ వెలుగు, కర్నూలు: రాయలసీమ యువజన పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లూరు గ్రామ రెవెన్యూలోని విఠల్ నగర్ లో అగ్రసేని రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత బి.కె.సింగ్ తిరుమల గిరి వెంచర్ పేరుతో ల్యాండ్ కన్వర్షన్ లేకుండా, ఎటువంటి వెంచర్ అప్రువల్స్ లేకుండా హంద్రీనది భూమి మరి
యు దేవాదాయ భూములలో అక్రమంగా నిర్మాణాలు చేస్తే ఆ అక్రమ నిర్మాణాలకు కర్నూలు మునిసిపల్ టౌన్ ప్లాన్ అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. బఫర్ జోన్ 50 మీటర్లు దూరం కాకుండా ఏకంగా హంద్రీనదిలోని సర్వేనెంబర్: 470Bలో అక్రమ నిర్మాణాలకు పొజిషన్ కు సంబంధం లేని ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు టౌన్ ప్లాన్ అధికారులు అప్రువల్స్ ఇవ్వడం అధికారులు అక్రమాలకు పరాకాష్ఠ అన్నారు. ఈ వెంచర్ లో 91 ఇండ్లు నిర్మాణం చేయగా హంద్రీనదిలో 16 ఇండ్లు, బఫర్ జోన్ లో 46 ఇండ్లు నిర్మాణం చేసారన్నారు. హంద్రీనదిలోని అక్రమ నిర్మాణాలు గత కలెక్టర్ పడగొట్టమని ఆర్డర్ ఇచ్చి ఏడాదిన్నర దాటినా చర్యలు తీసుకోకపోవడం మానేసి పెద్ద మొత్తాలలో లంచాలు తీసుకొని నిర్మణాలకు అప్రువల్స్ ఇవ్వడం దుర్మార్గమైన చర్యా అని అన్నారు. పైగా హైకోర్టులో కేసు ఉంది అని పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. స్టే కోసం బిల్డర్ రెండు సార్లు హైకోర్టు ను సంప్రదించగా కోర్టు ఎటువంటి స్టే ఇవ్వకుండా కేసును డిస్పోస్డ్ చేసి చర్యలపై అధికారులకే అప్పజెప్పిందన్నారు. హంద్రీనది బఫర్ జోన్ లో నిర్మణాలు నగర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అలాగే నదులు,వాగులు,దేవాలయ భూములు,వక్ఫ్ భూములతో వ్యాపారం చేస్తున్న అగ్రసేని బిల్డర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి సహకరిస్తున్న అధికాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ మునిసిపల్ కమీషనర్ త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లేనిపక్షంలో రాయలసీమ యువజన పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో నాయకులు పి.వసంత్, విజయ్ , మధు, తదితరులు పాల్గొన్నారు.