శనగ పంటలో వేరు కుళ్లు తెగులు నివారణకు సలహాల అందించిన ఏవో 

శనగ పంటలో వేరు కుళ్లు తెగులు నివారణకు సలహాల అందించిన ఏవో 

ముద్దనూరు, న్యూస్ వెలుగు;  ముద్దనూరు మండలంలోని కాండ్లో పల్లి గ్రామంలో పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ శనగ పంటలో వేరు కుళ్లు తెగులు సోకి మొక్కలు చనిపోతున్నాయి అని వీటి నివారణకు గాను హెక్సా కొనజోలు అనే మందును 2 యమ్.యల్. లేదా ప్రొపికొనజోలు అనే మందును 1 యమ్.యల్.లేదా సాఫ్ 2.5 గ్రాములు లేదా టేబుకొనజోలు 1 యమ్.యల్.ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.అలాగే కంది పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు గాను తగు సస్యరక్షణ చర్యలు పాటించాలని కోరారు.వేప నూనె 5 యమ్.యల్ మరియు కొద్దిగా సర్ప్ పౌడర్ ను కలిపి పిచికారీ చేయాలని కోరారు.బత్తాయి లో అంతరపంటగా సాగు చేసిన శనగ పంట ను పరిశీలించి రైతు శివ శంకర రెడ్డి కి తగు సలహాలు తెలిపారు. రైతులు పంట బీమాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సాగు చేసిన పంటలకు తప్పకుండా పంట బీమా ప్రీమియం చెల్లించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకుడు యన్.రామ సుంధర్ రెడ్డి మరియు రైతులు యుగంధర్ రెడ్డి,దివాకరరెడ్డి, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!