
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం
ఆర్డీవో భరత్ నాయక్
పెరవలి గ్రామంలో అంగన్వాడి సెంటర్ ను,మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆర్డీవో
మద్దికేర న్యూస్, వెలుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ తెలియజేశారు.శుక్రవారం రోజున మద్దికేర మండల పరిధిలోని గల పెరవలి గ్రామం నందు ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సుకు ముఖ్యఅతిథిగా పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ రెవెన్యూ సదస్సులలో భూములకు సంబంధించిన సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకురావాలని,ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలియజేశారు. అనంతరం పెరవలి గ్రామం నందు గల అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి అంగన్వాడీ టీచర్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పెరవలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి అధికారుల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పుష్టికరమైన భోజనాన్ని అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పిడి హార్టికల్చర్ ఉమాదేవి, మద్దికేర మండల తహాసిల్దార్ హుస్సేన్ సాహెబ్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, గ్రామ సర్పంచ్ మల్లికార్జున,పెరవలి వీఆర్వోలు బాలవర్ధిరాజు,మల్లికార్జున,పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితర అధికారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.